Advertisement

కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న 3 మృతదేహాలు...!

By: Anji Mon, 05 Oct 2020 09:48 AM

కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న 3 మృతదేహాలు...!

కృష్ణాజిల్లా విస్సన్నపేట శివారులో ముగ్గురు అనుమానాస్పద మృతి కలకలంరేపింది. సోమవారం ఉదయం ముగ్గురు డెడ్‌బాడీలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకు విస్సన్నపేట పోలీసులు ముగ్గురి వివరాలపై ఆరా తీశారు. స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతులలో ఒక మహిళ, ఒక యువతి, మరో వ్యక్తి ఉన్నాడు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వీరు వీధుల్లో ప్లాస్టిక్ సామానులు అమ్ముకునే సంచార చిరు వ్యాపారులని స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు ఎలా చనిపోయారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా.. హత్య జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Advertisement