Advertisement

  • ప్రేమ విఫలం అయింది అని ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు మృతి ..

ప్రేమ విఫలం అయింది అని ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు మృతి ..

By: Sankar Sun, 19 July 2020 1:43 PM

ప్రేమ విఫలం అయింది అని ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు మృతి ..



యువతీ , యువకులు ప్రేమించుకోవడం వారి ప్రేమను తల్లితండ్రులు అడ్డగించడం ఆవేశంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల కాలంలో తరుచుగా చూస్తూనే ఉన్నాం అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం ప్రేమికులతో పాటు ప్రేమికురాలి స్నేహితురాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది ...

మధ్యప్రదేశ్ రాష్ట్రము బాలాఘాట్‌లోని లాంజీకి చెందిన రాజేశ్‌ , అదే గ్రామానికి చెందిన సగుంటబాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా పెద్దలు వారి పెళ్లికి అడ్డు రావడంతో మనస్థాపానికి గురైన రాజేశ్‌ జూలై 12న తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణ వార్త తెలుసుకున్న ప్రియురాలు సగుంట బాయి కూడా 4 రోజుల తరువాత జూలై 16న తన ఇంటి సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

స్నేహితురాలు మరణించిన వార్త తెలుసుకున్న సగుంట బాయి స్నేహితురాలు జానకి తీవ్ర మనస్థాపానికి గురై మరుసటిరోజే ఇంటికి సమీపంలో ఒక చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సగుంట బాయి, జానకి వరుసకు అక్కచెళ్లెళ్లు అవుతారని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానకి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లాంజిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యలు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి..

Tags :
|

Advertisement