- హోమ్›
- వార్తలు›
- ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న పాక్ క్రికెట్ జట్టుకు షాక్ ..ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న పాక్ క్రికెట్ జట్టుకు షాక్ ..ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్
By: Sankar Tue, 23 June 2020 10:52 AM
కరోనా సంక్షోభంలో కూడా ఇంగ్లాండ్ వెళ్లి క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు సుముఖత తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ టీంలో కరోనా ఒక్కసారిగా కలకలం రేపింది ..ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు కంగుతిన్నారు ..దీనితో ఇంగ్లాండ్ పర్యటన అనుమానంలో పడింది ..
ఇంకో వారం రోజులల్లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు కోసం బయలుదేరి వెళ్ళేది ..ఆ లోపు ఆటగాలందరికి టెస్ట్ చేయాలని నిర్ణయించుకొని చేయించడంతో ఇలా ముగ్గురు ఆటగాళ్లు బయట పడ్డారు అని పిసిబి తెలిపింది ..ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లలో కొందరికి కోవిడ్–19 టెస్టులు నిర్వహించగా... జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు ..యువ ఆటగాడు హైదర్ అలీతోపాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు వర్గాల్లో ఆందోళన నెలకొంది
అయితే పరీక్షల ముందు వరకు వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఈ ముగ్గురితో పాటు ఇమాద్ వసీమ్, ఉస్మాన్ షిన్వారీలనూ పరీక్షించగా వారి ఫలితాలు నెగెటివ్గా వచ్చాయని పీసీబీ వెల్లడించింది. మరోవైపు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, ఆల్రౌండర్ షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్లతోపాటు కొంతమంది జట్టు అధికారులు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలకు హాజరయ్యారు వీరి ఫలితాలు నేడు వచ్చే అవకాశముందని పీసీబీ తెలిపింది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్లు తౌఫిక్ ఉమర్, షాహిద్ అఫ్రిదిలు కరోనా బారిన పడ్డారు.