జియో లాంచ్ చేసిన మూడు కొత్త వార్షిక ప్లాన్లు ...
By: chandrasekar Fri, 06 Nov 2020 11:18 AM
భారతదేశ నంబర్ వన్
ఆపరేటర్ జియో ఫోన్ వినియోగదారుల కోసం మూడు కొత్త వార్షిక ప్లాన్లను లాంచ్ చేసింది.
ప్రస్తుతం ఉన్న ఆల్-ఇన్-వన్ ప్లాన్లకు ఇవి యాడ్ అయ్యాయి. కాకపోతే వీటి వ్యాలిడిటీ
కాస్త ఎక్కువ. అవే రూ.1,001, రూ.1,301,
రూ.1,501 ప్లాన్లు. వీటితో జియో ఫోన్ వినియోగదారులు 504 జీబీ
వరకు డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్లు జియో ఫోన్ యూజర్లు నెలనెలా కాకుండా ఒకేసారి
సంవత్సరానికి రీచార్జ్ చేసుకునేలా ఉపయోగపడతాయి. వీటిలో రూ.1,001
ప్లాన్ ద్వారా 49 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 150 ఎంబీ
పరిమితితో ఈ డేటా అందుబాటులో ఉంటుంది. 150 ఎంబీ తర్వాత డేటా వేగం 64
కేబీపీఎస్కు పడిపోతుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర
నెట్ వర్క్లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100
ఎస్ఎంఎస్ లభిస్తాయి. జియో యాప్స్కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
దీని వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
ఇక రూ.1,301
ప్లాన్ విషయానికి వస్తే దీని ద్వారా మొత్తంగా 164 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 500 ఎంబీ
అన్నమాట. మిగతా లాభాలన్నీ రూ.1,001 ప్లాన్ తరహాలోనే ఉంటాయి. వ్యాలిడిటీ కూడా 336
రోజులు మాత్రమే. ఇక రూ.1,501 ప్లాన్ ద్వారా 504 జీబీ డేటా లభించనుంది. అంటే రోజుకు 1.5 జీబీ
అన్నమాట. దీని వ్యాలిడిటీ కూడా 336 రోజులుగానే ఉంది. మిగతా లాభాలన్నీ పై రెండు ప్లాన్ల
తరహాలోనే ఉంటాయి. జియోలో రూ.75 నుంచి రూ.185 వరకు మరో నాలుగు ఆల్-ఇన్-వన్ ప్లాన్లు కూడా
అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండనుంది. 56 జీబీ వరకు డేటా దీని
ద్వారా లభించనుంది. అంటే రోజుకు 2 జీబీ అన్నమాట. జియో నుంచి జియోకు కాల్స్ ఉచితం. ఇతర
నెట్ వర్క్లకు 500 నిమిషాలు లభిస్తాయి. వీటిలో రూ.185, రూ.155
ప్లాన్ల ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.