Advertisement

  • ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...అతివేగమే ప్రాణాలు తీసింది

ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...అతివేగమే ప్రాణాలు తీసింది

By: chandrasekar Tue, 01 Sept 2020 4:52 PM

ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...అతివేగమే ప్రాణాలు తీసింది


బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్తున్న కుటుంబం జిల్లాలోని బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. మోపెడ్ అడ్డురావడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మోపెడ్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం ఈ ప్రమాదంలో చనిపోయారు. భర్త, అత్తమామలు చనిపోయారు. కోడలు మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కేవలం ఏడు నెలల కిందటే వివాహమైన శిరీష ఈ ప్రమాదంలో భర్తని కోల్పోయి రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. అత్యంత అధునాతన భద్రతా ప్రమాణాలు (సేఫ్టీ మెజర్స్) ఉన్న వోల్వో కాస్ట్‌లీ కారు ప్రమాదానికి గురైంది. వెనక నుంచి లారీని బలంగా ఢీకొట్టడంతో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయినా తండ్రీకొడుకుల ప్రాణాలు గాల్లోకలసిపోయాయి.

సీట్ బెల్ట్ పెట్టుకుని.. ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్ అయినప్పటికీ వెంకటేష్, శ్రీనివాసులు ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంసంగా మారింది. లారీని ఢీకొట్టిన సమయంలో కారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుపు వేగంతో వెళ్తున్న కారుకి ఒక్కసారిగా మోపెడ్ అడ్డురావడంతో మోపెడ్‌ను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి ముందుభాగం నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగ్స్ పగిలిపోయాయి. సీట్ బెల్టు పెట్టుకున్న వారు అలాగే ప్రాణాలు కోల్పోయారు. వెనుక కూర్చుని ఉన్న రత్నమ్మ కూడా తీవ్రగాయాలపాలై మృతి చెందారు. వెనక డోర్ ఓపెన్ కావడంతో శిరీష కారులో నుంచి కిందపడిపోయి గాయాలతో బయటపడినట్లు సమాచారం.

Tags :
|

Advertisement