Advertisement

క్వారీలో పేలుళ్ల ధాటికి ముగ్గురు దుర్మరణం

By: chandrasekar Sat, 17 Oct 2020 1:33 PM

క్వారీలో పేలుళ్ల  ధాటికి ముగ్గురు దుర్మరణం


శుక్రవారం ఒరిస్సాలోని రాయగడ జిల్లా పరిధిలోని క్వారీలో పేలుడు సంభవించింది. గన్‌పూర్‌లోని ఓకిలాగుడా ప్రాంత సమీపంలోని క్వారీలో పేలుళ్ల ధాటికి ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

క్వారీ నుంచి రాళ్లను తీసేందుకు పేలుళ్లు జరుపుతుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు.

ఘటనా స్థలంలో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement