Advertisement

దారుణం: ముగ్గురు సజీవదహనం అయ్యారు...!

By: Anji Sat, 26 Dec 2020 4:37 PM

దారుణం: ముగ్గురు సజీవదహనం అయ్యారు...!

ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జిల్లా దుబెన్ కా పూర్వ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇళ్లు మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం పాలయ్యారు.

వీరిలో ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబెన్ కా పూర్వ గ్రామంలోని సంగీతా యాదవ్ (28) ఇంట్లో నుంచి శనివారం (డిసెంబర్ 26) ఉదయం భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు వ్యాపిస్తున్న విషయం గుర్తించిన గ్రామస్థులు పరుగు పరుగున అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ఇంట్లో పరిశీలించగా.. సంగీతతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు (రెండేళ్లు, ఎనిమిదేళ్లు), ఒక కుమారుడు (ఆరేళ్లు) అగ్నికి ఆహుతయ్యారు.

వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోర్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ మహేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిందా? ఎవరైనా కావాలనే ఇంటికి నిప్పు పెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Tags :

Advertisement