Advertisement

  • నిజామాబాద్ జిల్లాలో విషాదం ...రిజర్వాయర్ లో పడి ముగ్గురు యువతులు మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం ...రిజర్వాయర్ లో పడి ముగ్గురు యువతులు మృతి

By: Sankar Sun, 15 Nov 2020 7:19 PM

నిజామాబాద్ జిల్లాలో విషాదం ...రిజర్వాయర్ లో పడి ముగ్గురు యువతులు మృతి


నిజామాబాదు జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు.

సెల్ఫి దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. మృతులు బోధన్ పట్టణం రాకాసి పెట్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

బోధన్‌లోని వార్డు ఓ కౌన్సిలర్ అన్నయ్య కూతుర్లు జుబెరా (16), మశేరా (14), మీరాజ్‌ (12)గా తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడంతో కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.గుంటూరు కొల్లిపర మండలం పిడపర్తి పాలెం లో విషాదం చోటుచేసుకుంది. పశువులు కడగడానికి కాలువలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :
|
|
|

Advertisement