పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ఫాన్స్ బలి
By: chandrasekar Wed, 02 Sept 2020 4:05 PM
పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల కోసం చేస్తున్న ఏర్పాట్లలో తీవ్ర ఆందోళన చోటుచేసుకుంది. తెల్లవారితే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కావడంతో తమ అభిమాన నటుడు, నాయకుడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావించిన ఆయన అభిమానులు ముగ్గురు ఊహించని విధంగా విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది.
కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై 25 అడుగుల ఎత్తున్న బ్యానర్లను ఏర్పాటు చేసే క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలకు ఆ బ్యానర్ తగలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రం గాయాల పాలైనారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తెల్లవారితే జనసేనాని బర్త్ డే వేడుకల్లో మునిగితేలాలని భావించిన పవన్ అభిమానులకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.