Advertisement

  • తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి ..ఏడుగురికి తీవ్ర గాయాలు

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి ..ఏడుగురికి తీవ్ర గాయాలు

By: Sankar Tue, 15 Sept 2020 11:40 AM

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి ..ఏడుగురికి తీవ్ర గాయాలు


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున తుఫాన్ వాహనం.. లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి ఆందోళకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఎద్దును తప్పించబోయి వాహనం లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద బాధితులు తాడిపత్రి మెయిన్ బజార్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇలా ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags :
|
|
|

Advertisement