Advertisement

  • క్రిష్ణా జిల్లాలో విషాదం.. కారు డోర్ లాక్ పడి ముగ్గురు చిన్నారులు మృతి

క్రిష్ణా జిల్లాలో విషాదం.. కారు డోర్ లాక్ పడి ముగ్గురు చిన్నారులు మృతి

By: Sankar Thu, 06 Aug 2020 8:12 PM

క్రిష్ణా జిల్లాలో విషాదం.. కారు డోర్ లాక్ పడి ముగ్గురు చిన్నారులు మృతి



చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో వారిని ఎప్పుడు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ..పెద్ద వాళ్ళు ఇంట్లో పనుల్లో నింగినం అయి ఉంటె పిల్లలు బయటకు వెళ్లి ఆడుకుపోవడానికి ప్రయత్నిస్తారు ..అయితే కారు ఉన్న ఇంట్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ,..ఎందుకంటే పిల్లలు కారులోకి వెళ్లి లాక్ వేసుకుంటే తిరిగి బయటకు ఎలా రావాలో తేలేక ఊపిరి ఆడక చనిపోయిన ఘటనలు అనేకం చూసాము ..ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలో సరిగ్గా అలంటి ఘటనే జరిగింది

కారులో ఆడుకోవాలన్న సరదా పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కార్ డోర్ లాక్ అవటంతో ఊపిరాడక మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ క్వార్టర్స్ లో అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.ఇంటి వద్ద పార్క్‌ చేసిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ కారు డోర్‌ లాక్‌ అయింది.

అందులో చిక్కుకుపోయిన చిన్నారులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోపలే ఊపిరాడక కుప్పకూలిపోయారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు .సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీన్‌ని పరిశీలించారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Tags :
|
|
|
|

Advertisement