గ్యాస్ సిలిండర్ పేలడంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు
By: chandrasekar Wed, 09 Sept 2020 1:17 PM
పంజాబ్లోని లూధియానా
బస్తీ జోధేవాల్ సమీపంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన
ఐదుగురికి గాయాలయ్యాయి. బస్తీ జోధేవాల్
ప్రాంతంలో ఓ కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.
సోమవారం మధ్యాహ్నం ఇంట్లో
ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలకు
తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం
హాస్పిటల్ కు తరలించారు.
బాధితుల పరిస్థితి
విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇంటి నుంచి మూడు చిన్న సిలిండర్లు, పెద్ద
సిలిండర్ను స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్వీందర్ సింగ్ తెలిపారు. ఇంట్లో వరుసగా
రెండు పేలుళ్లను విన్నామని, మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులంతా తీవ్రంగా
గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.