రైతుపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి
By: chandrasekar Fri, 02 Oct 2020 7:08 PM
ఓ రైతు ఫై ఎలుగుబంట్ల
దాడి జరిగింది. దాడిలో రైతుకు తీవ్రంగా
గాయాలైనాయి. ఈ విషాద ఘటన జిల్లాలోని హవేలీఘనపూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు కుర్మ మొగులయ్య తన పొలం వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో రైతుపై మూడు
ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. దాడిలో మొగులయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
గుర్తించిన స్థానికులు అతడిని మెదక్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రథమ చికిత్స
అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
Tags :
three |
bears |
attacked |
farmer |