Advertisement

రైతుపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి

By: chandrasekar Fri, 02 Oct 2020 7:08 PM

రైతుపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి


ఓ రైతు ఫై ఎలుగుబంట్ల దాడి జరిగింది. దాడిలో రైతుకు తీవ్రంగా గాయాలైనాయి. ఈ విషాద ఘటన జిల్లాలోని హవేలీఘనపూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కుర్మ మొగులయ్య తన పొలం వద్దకు వెళ్లాడు.

ఈ క్రమంలో రైతుపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. దాడిలో మొగులయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు అతడిని మెదక్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

Tags :
|
|
|

Advertisement