Advertisement

  • కోట్ల ఆస్థి పంచినా కూడా తండ్రిని పట్టించుకునే మనసు మాత్రం కొడుకులకు రాలేదు ..

కోట్ల ఆస్థి పంచినా కూడా తండ్రిని పట్టించుకునే మనసు మాత్రం కొడుకులకు రాలేదు ..

By: Sankar Thu, 06 Aug 2020 2:14 PM

కోట్ల ఆస్థి పంచినా కూడా తండ్రిని పట్టించుకునే మనసు మాత్రం కొడుకులకు రాలేదు ..



పిల్లలు ఎదిగేదాకా తల్లి తండ్రులు ఎంతో చూసుకుంటారు కానీ ఒక్కసారి పిల్లలు పెద్దవాళ్ళు అయి తల్లి తండ్రులు వృదాప్యంలోకి వచ్చాక పట్టించుకునే పిల్లలు చాల తక్కువ మంది ఉంటారు..అయితే ఒక్కో కుమారుడికి కోటి రూపాయల చొప్పున ఆస్తి పంచి ఇచ్చినా.. వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పట్టించుకోవడానికి వారి మనసు రాలేదు.

పంచాయతీ పెద్దలు చెప్పినా, పోలీసుల కౌన్సెలింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. చివరకు తండ్రి ఆరోగ్యం క్షీణించి.. హాస్పిటళ్లలో చావు బతుకుల మధ్య ఉన్నా కనీసం చూసేందుకు వెళ్లలేదు. దీంతో ఆ కసాయి కొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

కోహెడ మండలం శనిగరం పరిధిలోని శంకర్ నగర్‌కు చెందిన పోతు మల్లయ్య కు రవీందర్, జనార్ధన్, రవీందర్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఏడాది క్రితం ఒక్కో కొడుక్కి కోటి రూపాయల చొప్పున మూడు కోట్ల రూపాయల ఆస్తిని ఆయన పంచి ఇచ్చాడు. కానీ ఆయన్ను పోషించడానికి కొడుకులు మాత్రం ముందుకు రాలేదు. దీంతో గ్రామ పెద్దలు చెప్పినా.. మేం చూసుకోమని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారి తీరు మారలేదు. చివరకు మల్లయ్య హుస్నాబాద్ ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా.. ఆయన సైతం కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ వారు మాత్రం మారలేదు.

దీంతో ఏడాది నుంచి గ్రామస్థులు పెట్టింది తింటూ జీవితాన్ని వెల్లదీస్తున్న మల్లయ్యను.. గ్రామ పెద్దలు, పోలీసులు కలిసి నెల రోజుల క్రితం అంకిరెడ్డిపల్లిలోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించగా.. సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు.

మీ నాన్నకు బాగోలేదు.. పరిస్థితి విషమంగా ఉందని ముగ్గురు కుమారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కానీ కనీసం చూడటానికి కూడా వారు రాలేదు. దీంతో శనిగరం వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు కొడుకుల బాగోతం తెలుసుకున్న ఎస్సై రాజ్‌కుమార్ వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :
|
|

Advertisement