Advertisement

  • తీవ్రమైన నొప్పితో కనీసం కదలేకపోయా..కోళికోడ్ విమాన ప్రమాద బాధితుడు

తీవ్రమైన నొప్పితో కనీసం కదలేకపోయా..కోళికోడ్ విమాన ప్రమాద బాధితుడు

By: Sankar Tue, 25 Aug 2020 3:21 PM

తీవ్రమైన నొప్పితో కనీసం కదలేకపోయా..కోళికోడ్ విమాన ప్రమాద బాధితుడు


కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీర‌ని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో నా రెండు చేతులు పోయాయ‌నుకున్నా. తీవ్ర‌మైన నొప్పితో క‌నీసం క‌ద‌ప‌డానికి కూడా వీలు లేనంత బాధ‌ను భ‌రించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెల‌కువ రాగానే నా సోద‌రుడిని నేను అడిగిన మొద‌టి ప్ర‌శ్న నా చేతులు ఏవి అని. ఆ స‌మ‌యంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఎవ‌రో నన్ను స్ట్రెచర్‌పై ప‌డుకోబెట్టారు.

మ‌ధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అంద‌రం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాం. ప్ర‌తీ ఒక్క‌రిలో క‌రోనా గురించి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఏ ఒక్క‌రూ మాస్క్‌ను కొంచెం సేపు కూడా ప‌క్క‌న పెట్ట‌లేదు. ఎవ‌రూ వాష్‌రూంకు కూడా వెళ్ల‌లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అంద‌రిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న స‌మ‌యంలోనే పెద్ద శ‌బ్ధం రావ‌డంతో అంద‌రం చాలా భ‌య‌ప‌డ్డాం ఏం జ‌రుగుతుందో తెలుసుక‌నేలోపే విమానం ముక్క‌లైంది.

ఆ త‌ర్వాత ప్ర‌మాదం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాం' అనే విష‌యాల‌ను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement