ఐపీల్ 2020 టాప్-4 పాయింట్ల పట్టికలో ఆ టీంలు
By: chandrasekar Mon, 28 Sept 2020 6:07 PM
ఈ సరి ఐపీఎల్ 2020
సీజన్లో అంచనాలు తారుమారవుతున్నాయి. చివరి వరుసలో వున్న టీంలు మొదటకు మరియు మొదట
వున్న టీంలు చివరకు మారాయి. ఐపీఎల్ 2020 సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. టోర్నీలో ఇప్పటికే 9
మ్యాచ్లు ముగియగా పాయింట్ల పట్టికలో ఎవరూ
ఊహించని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి
ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. టోర్నీకి ముందు రాజస్థాన్
రాయల్స్ టీమ్ పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమవుతుందని మాజీ క్రికెటర్లు
అంచనా వేయగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కూడా టాప్-4 లో
ఉంటుందని ఎవరూ అంచనాలు వేయలేదు. సీజన్ లీగ్ దశలో ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో
రెండేసి మ్యాచ్లను ఆడనుండగా పాయింట్ల
పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధించనున్నాయి.
యూఏఈ లో జరిగే ఈ
మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ గెలుపొందడం ద్వారా
నెం.1
స్థానంలో నిలవగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఆడిన రెండింటిలోనూ విజయం సాధించడం ద్వారా
రెండో స్థానానికి ఎగబాకింది. ఇక పంజాబ్ జట్టు మూడు మ్యాచ్లాడి ఒకదాంట్లో ఓడినా
మూడో స్థానంలో నిలవగా నాలుగులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కొనసాగుతోంది.
ఐపీఎల్ 2020లో
భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (2
పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2), సన్రైజర్స్
హైదరాబాద్ (0) పట్టికలో చివరి మూడు స్థానాలకే పరిమితమవగా సన్రైజర్స్
హైదరాబాద్పై శనివారం రాత్రి గెలుపొందిన కోల్కతా నైట్రైడర్స్ ఐదో స్థానంలో
కొనసాగుతోంది. ఈ సీజన్లో ముంబై మరియు చెన్నై టీంలను ఎక్కువగా గుర్తించబడ్డాయి.