సంగీత ప్రపంచానికి ఇది చీకటి రోజు ...ఎస్పీ బాలు మరణంపై చిరంజీవి భావోద్వేగం
By: Sankar Fri, 25 Sept 2020 4:30 PM
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత ప్రపంచానికి చీకటి రోజని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బాలు తన సినిమాల్లో ఎన్నో పాటలు పాడారని, తన సక్సెస్లో ఆయన గాత్రానిది కూడా ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మరణ వార్త విని గుండె పలిగిదంటూ చిరంజీవి భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
సంగీత ప్రపంచానికి ఇది చీకటి రోజు. సంగీత మేధావి ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో ఓ శకం ముగిసింది. బాలు గారు నాకు ఎన్నో పాటలు పాడారు. నా కెరీర్ సక్సెస్లో ఆయన గాత్రానికి ప్రధాన పాత్ర ఉంది. దిగ్గజ గాయకుడు ఘంటసాల మరణంతో బోసిపోయిన సంగీత ప్రపంచానికి ఓ ధ్రువతారలా బాలు ఆవిర్భించారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత అభిమానులను బాలు దశాబ్దాలు పాటు తన గాత్రంతో అలరించారు. బాలు లేని లోటును తీర్చాలంటే ఆయనే మళ్లీ పుట్టాలి. ఆయన్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు