నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదు: ఎస్పీ చరణ్
By: chandrasekar Mon, 28 Sept 2020 10:05 AM
గాన గంధర్వుడు ఎస్పీ
బాలసుబ్రహ్మణ్యం సుమారు 50 రోజులు హాస్పిటల్లోనే బెడ్పై ఉండి మృత్యువుతో
పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్ 25వ తేదీన మద్యాహ్నం ఒంటి గంట 4
నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకం విషాదంలో
మునిగిపోగా మరోవైపు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగా జరగలేదని, ఆసుపత్రి
బిల్లు ఇదే అంటు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ విషయమై ఎస్పీ
చరణ్ సహా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చారు.
డబ్బు కోసమే ఇన్నిరోజులు
ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు
మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో
జనాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా దీనిపై బాలు కుమారుడు ఎస్పీ
చరణ్ క్లారిటీ ఇస్తూ ఆసుపత్రి వర్గాలను తప్పుబట్టకండి అని విజ్ఞప్తి చేశారు. ''ఆసుపత్రిలో
నాన్నగారి ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. హాస్పిటల్ బిల్లు
విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రి మంచి చికిత్స అందించింది. మాకు, వాళ్ళకి
ఎలాంటి వివాదాలు లేవు. నాన్నగారిని
అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదు, ఈ టైమ్లో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా
బాధపెడతాయి. '' అని చరణ్ తెలిపారు.
ఎస్పీ బాలు వైద్యానికి
అయిన బిల్లును తాము చెల్లించినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ అన్నారు.
బాలు తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
కావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆగస్టు 5న
చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం
వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు
ఐసీయూలో వెంటిలేటర్తో పాటు ఈసీఎంవో
సపోర్ట్తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ
తేదీన కన్నుమూశారు.