హీరో దగ్గరే దోచేసిన దొంగలు
By: chandrasekar Fri, 18 Dec 2020 11:09 AM
హీరో దగ్గరే దొంగలు
దోచేసిన సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ప్రముఖ హీరో
కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తిక్ నుండి దొంగలు విలువైన వస్తువులను దోచేశారు.
సినిమాలో హీరోలు హీరోయిజమ్ చేసి దొంగల నుండి ప్రజలను కాపాడతారు. కానీ ప్రస్తుతం
జరిగిన సంఘటనలో హీరో నుండి దొంగలు దోచేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు
అవాక్కైనారు.
ఈనెల డిసెంబర్ 2 వ
తేదీ చెన్నైలోని టీటీకే రోడ్ పై వెళుతున్న గౌతమ్ కార్తీక్ దగ్గర నుండి దొంగలు
విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అతను సైకిల్ మీద ఆ రోడ్ పై వెళుతున్నప్పుడు
ఆవైపు ఇద్దరు వచ్చి కార్తీక్ ను అడ్డగించి బెదిరించారు. అతనిని బెదిరించడంతో బాటు
అతని వద్ద వున్న విలువైన మొబైల్ ఫోన్ ను దోచుకెళ్లారు.
చాలా బిజీ గా వున్న
రోడ్డులో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి పోలీసులకి పిర్యాదు చేయడంతో
వారు శరత్ అనే వ్యక్తిని మరియు అతనికి సహాయం చేసిన మరొక మైనర్ వ్యక్తిని అదుపులోకి
తీసుకొని అరెస్ట్ చేశారు. శరత్ ఈ ఫోన్ ను మరొక వ్యక్తికి అమ్మేశాడు.
దీంతో బాటు ఆ వ్యక్తిని
కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గౌతమ్ కార్తీక్ మొట్ట మొదటిగా మణిరత్నం దర్శకత్వంలో 'కడలి' సినిమాలో
హీరో గా నటించాడు. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కానీ అతని
సినిమాలో ఏవీ కూడా పెద్దగా హిట్ సాధించలేదు.