Advertisement

  • ఏసీ గదిని చూసి తాను వచ్చిన పని మరిచిపోయి నిద్రపోయిన దొంగ

ఏసీ గదిని చూసి తాను వచ్చిన పని మరిచిపోయి నిద్రపోయిన దొంగ

By: Sankar Sun, 20 Sept 2020 08:28 AM

ఏసీ గదిని చూసి తాను వచ్చిన పని మరిచిపోయి నిద్రపోయిన దొంగ


చల్లగా ఉండే ఏసీ గదిని చూస్తే ఎవరికైనా సరే కాసేపు కునుకు తీయాలనిపిస్తుంది. ఆఫీస్ లో చాలా మంది ఇలానే చేస్తుంటారు. అయితే, కొంతమంది సినిమా థియేటర్లకు వెళ్లి హ్యాపీగా నిద్రపోతుంటారు. అయితే, దొంగతనానికి వచ్చిన ఓ దొంగ కావాల్సినవి దొంగిలించి పక్కనే ఉన్న ఏసీగదిలోకి వెళ్ళాడు.

అయితే, రూమ్ చల్లగా ఉండటంతో నిద్ర వచ్చింది. దీంతో ఆ దొంగ ఓ కునుకు తీశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాను. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బాబు అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అప్పులు తీర్చిడం కోసం దొంగతనం చేయాలనీ అనుకున్నాడు. కొన్ని రోజులు రెక్కీ నిర్వహించి, సెప్టెంబర్ 12 వ తేదీన ఓ పెట్రోల్ బంక్ యజమాని ఇంట్లో దొంగతనానికి పూనుకున్నాడు. అనుకున్నట్టుగా కావాల్సిన డబ్బులు దొంగిలించాడు.

అయితే, పక్కనే ఉన్న ఏసీ గదిలోకి వెళ్లగా ఆ గది చల్లగా ఉండటంతో మంచం కిందకు దూరి కాసేపు కునుకుతీశాడు. అది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దొంగ పోలీసులకు దొరికిపోయాడు.

Tags :
|
|
|

Advertisement