Advertisement

  • ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేదు: ‌కేంద్రం

ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేదు: ‌కేంద్రం

By: chandrasekar Mon, 21 Sept 2020 11:54 AM

ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేదు: ‌కేంద్రం


కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేద‌ని పేర్కొంది. ప్లాస్మా చికిత్సను కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్రధానమైన భాగంగా తాము గుర్తించట్లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే రాజ్యసభలో తెలిపారు.

కేంద్రం ప్రస్తుతం ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కూడా పరిశీలించట్లేదని చౌబే పేర్కొన్నారు. రాజ్య‌స‌భ‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన స‌మాధానంలో ఆయ‌న ఈ వివ‌రాలు తెలియ‌జేశారు.

కానీ, ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేసే విష‌య‌లో కొన్ని రాష్ట్రాలు చొరవ ప్రదర్శిస్తున్నాయని అశ్వినీ చౌబే తెలిపారు. కరోనా చికిత్స ప్రోటోకాల్‌కు సంబంధించి ప్లాస్మా చికిత్సను ఓ పరిశీలనాత్మక ట్రీట్‌మెంట్‌గా మాత్రమే కేంద్రం గుర్తించిందని చౌబే స్ప‌ష్టం చేశారు.

Tags :
|

Advertisement