ఆంధ్రప్రదేశ్ లో గురువారం కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు
By: chandrasekar Fri, 20 Nov 2020 11:19 AM
కరోనా వాక్సిన్ ఇంకా
అందుబాటులోకి రానందున దీని తీవ్రతను కట్టడి చేయలేక పోతున్నాము. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి
క్రమంగా కొనసాగుతోంది. గురువారం రాష్ట్రంలో కొత్తగా 1,316
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,821 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 11 మంది
ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. కానీ ముందుకంటే
ఈ సంఖ్య తక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తుంది.
వీరు అందించిన వివరాలను
పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,58,711కు చేరింది. 8,35,801 మంది చికిత్సకు కోలుకొని డిశార్జి అయ్యారు. 16 వేల
మంది హాస్పిటల్ ల్లో చికిత్స పొందున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు 6,910 మంది
మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 75,165 మంది కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ
తెలిపింది. ఇప్పటివరకు 94,08,868 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.