ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదనంగా మరో 16 మెడికల్ కళాశాలలు
By: chandrasekar Fri, 20 Nov 2020 11:18 AM
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు
అదనంగా మరో 16 మెడికల్ కళాశాలలు రానున్నాయి. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న వైఎస్ జగన్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త వైద్య కళాశాలల పనులు ఊపందుకున్నాయి.
అటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఏపీలో
ఇప్పుడు అదనంగా మరో 16 మెడికల్ కళాశాలలు
రాబోతున్నాయి. ఇవి ప్రైవేటు భాగస్వామ్యంలో రావడం లేదు, ఇదంతా
పూర్తిగా ప్రభుత్వ వైద్య కళాశాలలు. ప్రతి
పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలన్న ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా మరో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మించబోతున్నారు. ఇప్పటికే
దీనికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి.
దీని ద్వారా మరింత మంది విద్యార్థులకి
వైద్య కళాశాలల్లో సీట్లు లభించనున్నాయి.
ప్రస్తుతం 7 వేల 5 వందల
కోట్ల ఖర్చుతో కొత్త వైద్య కళాశాలల్ని నిర్మిస్తున్నామని రాష్ట్ర వైగ్య ఆరోగ్య శాఖ
మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మరోవైపు
గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్
కోసం వివిధ జిల్లాల్లో భవనాల నిర్మాణం చేపట్టామని మంత్రి నాని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో దాదాపు పది కోట్ల ఖర్చుతో డాక్టర్ వైెఎస్సార్
విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కానున్నాయన్నారు. దీనికి సంబంధించిన భవనాల నిర్మాణం
ప్రారంభించామన్నారు. మరోవైపు పశ్చిమ
గోదావరి జిల్లాలో 12 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అభివృద్ధికి దాదాపు 95
కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలోని
అన్ని ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందుల్ని ప్రజలకు అందుబాటులో
ఉంచామని వివరించారు. దీనివల్ల పేద ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు
మరింత అందుబాటులోకి రానున్నాయి.