కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలి నివాసంలో దొంగతనం
By: chandrasekar Wed, 14 Oct 2020 11:37 AM
తెలంగాణ హైదరాబాద్
పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో దొంగతనం కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో దొంగతనం జరిగింది. బంజారాహిల్స్లోని
ఆమె నివాసంలో దొంగతనం జరిగింది.
రూ. 3 లక్షల
రూపాయల నగదు, మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం
అయినట్లు రేణుకా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇంట్లో పనిచేసే
ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు రేణుకా చౌదరి పోలీసులకు తెలిపారు. ఇంట్లో
పని చేసేవారందరినీ విచారించిన తర్వాతే ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
రేణుకా చౌదరి ఫిర్యాదు మేరకు బయటి
వ్యక్తులు దొంగతనం చేశారా, లేక ఇంట్లో పని చేసేవాళ్లే దొంగతనానికి పాల్పడ్డారా అనే
కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రేణుక చౌదరి నివాసంతోపాటు
స్థానిక సీసీటీవి ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.