Advertisement

  • సోదరి పెళ్లికోసం కొత్తబట్టలు కొనడానికి వెళ్లిన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మరణం

సోదరి పెళ్లికోసం కొత్తబట్టలు కొనడానికి వెళ్లిన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మరణం

By: chandrasekar Sat, 08 Aug 2020 5:24 PM

సోదరి పెళ్లికోసం కొత్తబట్టలు కొనడానికి వెళ్లిన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మరణం


సోదరి పెళ్లికోసం తాను కొత్తబట్టలు కొనడానికి బైక్ పై వెళ్లిన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మరణం చెందాడు. మరికొద్ది రోజుల్లో జరగనున్న పెళ్లి ఏర్పాట్లకు అందరూ కలసి ఉత్సాహంగా వున్న సమయంలో తీవ్ర విషాదం చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. కొద్దిరోజుల్లో అక్క పెళ్లి జరగ నుండగా కొత్తబట్టల కోసం బయల్దేరిన తమ్ముడు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డుప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు యువకుడిని అమాంతం మింగేసింది. బైక్‌పై వెళ్తున్న యువకుడి ప్రాణాలను బలితీసుకుని పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. కాలువపల్లెకి చెందిన వెంకటాద్రి(17) సోదరి వివాహం ఈ నెల ఆగస్థు 13న నిశ్చయించారు. షాపింగ్ చేయడానికెళ్లిన తమ్ముడు రోడ్డుప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు.

అక్క పెళ్లి దగ్గర పడుతుండటంతో కొత్తబట్టలు కొనుక్కునేందుకు వెంకటాద్రి బైక్‌పై మరో యువకుడు మరియు బంధువు ప్రశాంత్(23) తో కలసి పలమనేరు బయల్దేరాడు. మార్గం మధ్యలో టి.వడ్డూరు వద్ద వేగంగా వచ్చిన ఆటో బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఆటో ఢీకొన్న ధాటికి బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. వెంకటాద్రి తల రోడ్డుకి తగలడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటాద్రి ప్రాణాలు కోల్పోయాడు. బంధువు ప్రశాంత్‌కి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చిత్తూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన విషాదాన్ని చూసి వూరు ప్రజలందరూ కన్నీరు శోకంలో మునిగారు.

Tags :
|

Advertisement