2022 వరకు యువత కరోనా వాక్సిన్ కోసం వేచి ఉండాల్సిందే
By: chandrasekar Fri, 16 Oct 2020 6:09 PM
హైదరాబాద్: కరోనా టీకా
కోసం యువత, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు 2022 వరకు
వేచి ఉండాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వైరస్ వల్ల రిస్క్లో
ఉన్నహెల్త్ వర్కర్లకు ముందుగా టీకా అందుతుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్
సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ప్రపంచ
వ్యాప్తంగా పలు రకాల కరోనా టీకా ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా
ఎవరికి టీకా ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్
వర్కర్లకు ముందు కరోనా టీకా ఇవ్వాలని చాలా మంది అంగీకరిస్తున్నారని, అయినా
ఆ వర్కర్లలో ఎవరికి ముందుగా ఇవ్వాలన్న అంశం కూడా చర్చిస్తున్నామన్నారు. ఆ తర్వాత
వృద్ధులకు టీకా ఇవ్వనున్నట్లు సౌమ్యా స్వామినాథన్ చెప్పారు.
కరోనా వ్యాక్సిన్
పంపిణీకి సంబంధించి అనేక మార్గదర్శకాలు రానున్నాయని, కానీ
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వ్యాక్సిన కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆమె తెలియచేసారు.
2021 వరకు కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వస్తుందని
ఆమె తెలిపారు. కానీ ఆ టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు. వైరస్
మరణాల సంఖ్య పట్ల నిర్లక్ష్యం వద్దన్నారామె. పెరుగుతున్న కేసుల సంఖ్య వల్ల మరణాల
రేటు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.