ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని వేరే రకంగా అన్వయించారన్న: పూజాహెగ్డే
By: chandrasekar Mon, 09 Nov 2020 3:17 PM
ఇంటర్వ్యూలో తాను చెప్పిన
మాటల్ని వేరే రకంగా అన్వయించారని పూజాహెగ్డే వివరణ ఇచ్చారు. దక్షిణాది ప్రేక్షకులు
కథానాయికల నాభి సౌందర్యానికి దాసోహమవుతారంటూ అగ్ర కథానాయిక పూజాహెగ్డే చేసిన
వివాదాస్పద వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలాన్ని సృష్టించాయి. ప్రేక్షకలోకంతో పాటు
తెలుగు చలన చిత్రసీమ ప్రముఖులు చాలా మంది ఆమె మాటల్ని తప్పుబట్టారు. సినీ
జీవితాన్ని ప్రసాదించిన టాలీవుడ్పై ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అహంకారపూరితంగా
మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఈ విమర్శల నేపథ్యంలో పూజాహెగ్డే తన వ్యాఖ్యలపై
వివరణ ఇచ్చింది.
తనపై వస్తున్న విమర్శలకు
సోషల్మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని
వేరే రకంగా అన్వయించారని ఆమె పేర్కొంది. నా మాటలను వేరే సందర్భానికి
అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో కాని అభిమానాన్ని మార్చలేరు. తెలుగు చలన
చిత్రసీమ నాకు ఎప్పటికీ ప్రాణసమానం. అభిమానులు నా మనసును అర్థం చేసుకుంటారని
తెలుసు. అయినప్పటికీ ఎలాంటి అపార్థాలకు తావివ్వకూడదనే ఉద్ధేశ్యంతో ఈ ప్రకటన
చేస్తున్నా అని తెలిపింది.
నా మాటలను వేరే
సందర్భానికి అన్వయిస్తున్నారు ఇది సరైనది కాదు, నా కెంతో ఇచ్చిన తెలుగు సినీరంగానికి ఎప్పటికి రుణపడి
ఉంటాను అని పూజాహెగ్డే పేర్కొంది. కొద్దిరోజుల క్రితం ఓ బాలీవుడ్ వెబ్ఛానెల్కు
ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పూజాహెగ్డే దక్షిణాది పరిశ్రమపై వివాదాస్పద కామెంట్స్
చేయడంతో తొలుత నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ఇది పరిశ్రమ వరకు
చేరడంతో వివాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో పూజాహెగ్డే ఇచ్చిన ప్రకటనతో వివాదానికి
పుల్స్టాప్ పడుతుందేమో వేచిచూడాలి.