Advertisement

  • పరాయి వ్యక్తితో రాసలీలలు సాగించడం కోసం భర్తని పక్కా ప్లాన్తో చంపేసిన భార్య

పరాయి వ్యక్తితో రాసలీలలు సాగించడం కోసం భర్తని పక్కా ప్లాన్తో చంపేసిన భార్య

By: chandrasekar Sat, 05 Sept 2020 1:30 PM

పరాయి వ్యక్తితో రాసలీలలు సాగించడం కోసం భర్తని పక్కా ప్లాన్తో చంపేసిన భార్య


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పనిచేసే చోటే పరాయి వ్యక్తితో రాసలీలలు సాగించింది. ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో దారుణానికి పాల్పడింది. పక్కా ప్లాన్‌తో చంపేసి కొత్త డ్రామాకు తెరతీసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనుకున్న పోలీసులకు పోస్టుమార్టం రిపోర్ట్ రూపంలో ఊహించని నిజం తెలిసింది. అది ప్రమాదం కాదు హత్యేనని తేలడంతో పోలీసులు విచారణలో నిజాలు కక్కించారు. తమిళనాడులో తిరపత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రమేష్‌ అదే ప్రాంతానికి చెందిన జయంతిమాల పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త విద్యుత్ శాఖలో ఉద్యోగి కాగా జయంతి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఆమె ఇటీవల కొత్త ఆస్పత్రిలో విధుల్లో చేరింది. అప్పటి నుంచి భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆస్పత్రిలో మరొకరితో రాసలీలలు సాగిస్తున్నట్టు భర్తకి తెలిసిపోవడంతో ఆమెను నిలదీశాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. దీంతో ఆగ్రహం చెందిన భార్య ఏకంగా భర్తనే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుని తన తల్లి సాయంతో భర్త హత్యకు ప్లాన్ వెసింది. భర్తను కిరాతకంగా హత్య చేసింది. అనంతరం భర్త శవాన్ని రద్దీగా ఉన్న రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించింది. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. తొలుత రోడ్డుప్రమాదంగా భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ ప్రమాదంలో చనిపోలేదని. అది కోల్డ్‌బ్లడెడ్ మర్డర్ అని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజాలు తెలిసాయి. ఆమెతో పాటు తల్లి, అందుకు సహకరించిన మరో నలుగురిని కూడా అరెస్టు చేసారు.

Tags :
|
|
|

Advertisement