యూపీలో మాజీ మంత్రి ప్రజాపతి ఇంటిపై ఈడీ దాడులు
By: chandrasekar Wed, 30 Dec 2020 6:39 PM
అక్రమ మైనింగ్
కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, ఆయన
డ్రైవర్, కొడుకులకు
చెందిన పలు నివాస, ఇతర ప్రాంతాల్లో ఈడీ బుధవారం దాడులు నిర్వహించింది. 2012 నుంచి
2016 మధ్య
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మైనింగ్ లీజులు ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనకు
సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు జరిగాయి. మాజీ మంత్రిపై 2002 నాటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద 2019
ఆగస్టు 4న ఈడీ
కేసు నమోదు చేసింది.
అమేథీలోని ఆయన నివాసంపై
ఈడీ బృందాలు దాడులు చేయగా, మరో బృందం అమేథీ జిల్లా లోని తికారి ప్రాంతంలో ఉన్న
తన డ్రైవర్ రాజా రామ్ నివాసంపై దాడులు చేసింది. లక్నోలోని ప్రజాపతి కుమారులు అనిల్, అనురాగ్
లకు చెందిన విభూతి ఖండ్ కార్యాలయంలో మరో దాడి జరిగింది. అక్రమ మైనింగ్ నుంచి
నిధులను ప్రజాపతి కుమారులు కంపెనీల ద్వారా అక్రమంగా రవాణా చేశారని ఈడీ వర్గాలు
ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రజాపతికి నమోదు చేసిన ఆదాయ వనరులకంటే ఎక్కువ
మొత్తంలో ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర విజిలెన్స్ అవినీతి నిరోధక
చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గనుల కుంభకోణంలో మాజీ మంత్రిపై కూడా సీబీఐ
గతేడాది కేసు నమోదు చేసింది. ప్రజాపతి 2017 గ్యాంగ్ రేప్ కేసులో ప్రస్తుతం లక్నో జైలులో ఉండగా, అతని
కుమారుడు అనిల్ చీటింగ్ కేసులో జైలులో ఉన్నాడు.