కరోనాను మాయం చేసేందుకు వ్యాక్సిన్ ఏమి మంత్రదండం కాదన్న డబ్ల్యుహెచ్ఓ
By: chandrasekar Fri, 18 Dec 2020 10:58 AM
ప్రపంచంలో ఉండే ప్రజలందరూ
వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అని
తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ సమయంలో అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనా
వైరస్ ను ఒక్కసారిగా మాయం చేసేందుకు వ్యాక్సిన్ ఏమి మంత్రదండం కాదని
డబ్ల్యుహెచ్ఓ రీజినల్ ఎమర్జెన్సీ డైరెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం ప్రజలందరూ
మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం మరియు వైరస్ అధికంగా ఉన్న
ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల క్షేమంగా బయటపడవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు
అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ వల్ల కరోనా వైరస్ ను వెంటనే అంతమొందించడం వీలు
కాదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనడం ఎంత ముఖ్యమో ప్రపంచం మొత్తానికి
కావలసిన వ్యాక్సిన్ ను తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం దాని కంటే
చాలా పెద్ద విషయం అని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ ను తయారు
చేసిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి ప్రజలందరికీ అందుబాటులోకి
తీసుకువచ్చి వాళ్ళకి చేరే విధంగా చూడాలని ఆయన తెలిపారు. ప్రపంచంలో కరోనా వైరస్
ఉన్నంతకాలం ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నట్లేనని అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు
తీసుకోవాలని ఆయన తెలిపారు.