గులాబీ పార్టీకే మా మద్దతన్న లక్ష్మాపూర్ గ్రామస్తులు
By: chandrasekar Mon, 05 Oct 2020 09:32 AM
గులాబీ పార్టీకే
లక్ష్మాపూర్ గ్రామస్తులు తమ మద్దతును తెలిపారు. మేమంతా టీఆర్ఎస్ వెంటే ఉంటాం.
అభివృద్ధికి పాటుపడుతున్న గులాబీ పార్టీకే మా మద్దతు అని నినదించారు మల్లన్న సాగర్
ముంపు గ్రామాల్లో ఒకటైన లక్ష్మాపూర్ గ్రామస్తులు. వీరి అందరి మద్దతు కేసీఆర్
పార్టీకి ప్రకటించారు.
లక్ష్మాపూర్
గ్రామస్తులంతా మూకుమ్మడిగా టీఆర్ఎస్ కే మా సంపూర్ణ మద్దతని తీర్మాన పత్రాన్ని
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి
జలాల కోసం మేం ముందు ఉంటాం అని అప్పుడు ముందు
కొచ్చింది లక్ష్మాపూర్ గ్రామం.
వీళ్ళందరూ టీఆర్ఎస్
గెలుపు కోసం కూడా ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. నాటి మీ త్యాగం ఎన్నడూ
మరవమన్నారు. గులాబీ పార్టీ గుండెల్లో మీరు ఉంటారు. మీ త్యాగం వెలకట్ట లేనిదన్నారు.
మిమ్మల్ని ప్రభుత్వం ఎప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని మంత్రి తెలిపారు.
మీ త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.