Advertisement

ఢిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,389

By: chandrasekar Sat, 29 Aug 2020 4:49 PM

ఢిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,389


క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావం దేశ ‌రాజ‌ధాని ఢిల్లీలో ఏమాత్రం త‌గ్గడం లేదు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 1808 మందికి క‌రోనా పాజిటివ్ నమోదయ్యాయి.

దీంతో ఢిల్లీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,412కు చేరింది. అందులో 1,51,473 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా మ‌రో 13,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఢిల్లీలో క‌రోనా మ‌ర‌ణాలు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం కూడా 20 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,389కి చేరింది. ఢిల్లీ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Tags :
|
|
|
|

Advertisement