దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,75,701కి చేరగా మరణాల సంఖ్య 55,794కి పెరిగింది
By: chandrasekar Sat, 22 Aug 2020 5:18 PM
భారత్లో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి నిత్యం 70వేలకు చేరువలో కరోనా కేసులు, దాదాపు వేయి మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 69,878 కరోనా కేసులు నమోదు కాగా నిన్న ఈ మహమ్మారి కారణంగా 945 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
29,75,701కి చేరింది. దీంతోపాటు మరణాల సంఖ్య
55,794కి పెరిగింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,97,330 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు
22,22,577 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ICMR ఆగస్టు చివరి నాటి కల్లా ఒకేరోజులో 10లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దానిని అనతి కాలంలోనే పూర్తి చేసింది. ఆగస్టు 21న దేశవ్యాప్తంగా
10,23,836 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో ఆగస్టు 21వరకు 3,44,91,073
నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.