భవనం పైఅంతస్తు కుప్పకూలి డ్రైనేజీ కాల్వలో పడి ముగ్గురు మహిళలు గల్లంతు
By: chandrasekar Wed, 05 Aug 2020 12:21 PM
మంగళవారం ముంబై నగరంలో
కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శాంటాక్రూజ్ త్రిమూర్తి చాల్ ప్రాంతంలో భవనం గ్రౌండ్ఫ్లోర్ పైకప్పు, పైఅంతస్తు
కుప్పకూలి వెనుక భాగంలోని డ్రైనేజీ కాల్వలో పడి ముగ్గురు మహిళలు గల్లంతైనారు.
ఈ ఘటన గురించి ముంబై
బ్రిగేడ్ ముఖ్య అగ్నిమాపక అధికారి
ప్రభాత్ ఎస్.రహంగ్డేల్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ఈ ఘటన జరగ్గా
స్థానికులు తమకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా
స్థలానికి చేరుకునేలోగా డ్రైనేజీ కాల్వలో కొట్టుకుపోతున్న బాలికను పోలీసులు
రక్షించి వీఎన్ దేశాయ్ హాస్పిటల్ కు తరలించారు. ముగ్గురు మహిళల ఆచూకీ లభించడం
లేదని, వారి
ఆచూకీ కోరకు వెతుకుతున్నారని సీఎఫ్ఓ పేర్కొన్నారు.
సోమవారం రాత్రి వరకు
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంబై నగరంతోపాటు శివారులోని లోతట్టు ప్రాంతాలు
జలమయమయ్యాయి. రహదారులు చెరువులలా మారిపోయాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షం
కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణశాఖ.