Advertisement

  • బాలుడుని బైక్‌పై కిడ్నాప్ కు ప్రయత్నించిన దుండగులు

బాలుడుని బైక్‌పై కిడ్నాప్ కు ప్రయత్నించిన దుండగులు

By: chandrasekar Fri, 04 Sept 2020 6:38 PM

బాలుడుని బైక్‌పై కిడ్నాప్ కు ప్రయత్నించిన దుండగులు


పట్ట పగలే కిడ్నాప్ కు ప్రయత్నించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. మాగుంట లేఔట్‌లో నివసించే దంపతులకు అక్షిత్(12) అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలుడిని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో భయంతో కిడ్నాపర్లు పరారయ్యారు. దీంతో బాలుడు కిడ్నపర్ల బారినుండి తప్పించుకున్నాడు.

బాలుడు కేకలు గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమైన వారిని వెంబడించి ఒకడిని పట్టుకోగా మరొకడు పరారయ్యాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ కెమెరా పుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. బాలుడు అప్రమత్తతో కేకలు వేయడంతో తప్పించుకోగలిగాడు.

Tags :
|
|

Advertisement