టొమాటతో బాటు మినీ వాన్ ను దోచుకెళ్లిన దుండగులు
By: chandrasekar Wed, 30 Dec 2020 6:34 PM
టొమాటో ధర తగ్గడంతో
దొంగలు కూడా దానిని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. కనగనపల్లి మండలంలోని
మెయిల్లపల్లి వద్ద టొమాటోతో నిండిన వాహనంతో దుండగులు దోచుకెళ్లారు. వివరాలు
పరిశీలిస్తే ఒక రైతు తను పండించిన టొమాటోలను సోమవారం తన మినీవాన్లో ఎక్కించి
వాహనాన్ని మెయిలపల్లిలోని తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. అతను మంగళవారం
మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మడానికి
టొమాటలను సిద్ధంగా ఉంచాడు. దుండగులు ఈ వాహనంలో వున్న టమాటోలతో బాటు వాహనాన్ని
దోచుకెళ్లి అందులో వున్న 30
డబ్బాల టమోటాల మొత్తం లోడ్ను మంగళవారం తెల్లవారుజామున సీతారంపల్లి వద్ద హైవేపై
పడేశారు.
మంగళవారం ఉదయం లేచి చూడగా
రైతు యొక్క మినీవాన్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు పిర్యాదు చేసాడు. వారు
మినీ వాన్ కోసం వెతకగా సమీపంలోని గ్రామంలో
మొత్తం టొమాటోలను రోడ్డుపై పడవేయబడిందని కనగనపల్లి పోలీసులు తెలియజేసారు. పోలీసులు
మినీ వాన్ కోసం గాలిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి వుంది.