Advertisement

భారత్‌లో విడుదలైన మూడో పోకో ఫోన్ సేల్‌ నేడే

By: chandrasekar Wed, 15 July 2020 8:08 PM

భారత్‌లో విడుదలైన మూడో పోకో ఫోన్ సేల్‌ నేడే


షియోమీ అనుబంధ సంస్థ పోకో ఇటీవల భారత్‌లో పోకో ఎం2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో విడుదలైన మూడో పోకో ఫోన్‌ ఇది. కొత్త ఫోన్లను ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్‌సేల్‌ ప్రారంభంకానుంది.

ఈ ఫోన్‌ గ్రీన్‌, బ్లూ, బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు పోకో F1, పోకో X2 ఫోన్లను విడుదల చేసింది. సరికొత్త మోడల్‌ ప్రారంభ ధర రూ. 13,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ 4/64GB, 6/64GB and 6/128GB మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

4GB ర్యామ్‌ + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 13,999

6GB ర్యామ్‌ and 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ.14,999

6GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ.16,999

Tags :
|
|
|

Advertisement