పోలీసు రివాల్వర్నే కొట్టేసిన దొంగ
By: chandrasekar Mon, 23 Nov 2020 4:03 PM
పోలీసు రివాల్వర్నే ఓ
దొంగ కొట్టేసాడు. దీనికోసం వివరాలు పరిశీలిస్తే జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్పై
బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఐదుగురు పోలీసులు
అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడి
రివాల్వర్తో పాటు పది బులెట్లను దొంగిలించాడు. ఆ రివాల్వర్తో జ్యూవెలరీ
షాప్ యజమానులను బెదిరించి చోరీలకు పాల్పడాలని భావించాడు. అయితే నిందితుడి కోసం
ముమ్మరంగా గాలించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో
చోటుచేసుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సంజయ్ భాటియా
తెలిపిన వివరాల ప్రకారం దోపిడి కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది సెప్టెంబర్లో జైలకు
వెళ్లాడు. ఆ తరువాత పెరోలుపై బయటకు వచ్చాడు. 45 రోజులు పెరోల్ గడువు ముగిసిన తర్వాత అతడు నవంబర్ 30న
తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే పెరోల్పై బయటకు వచ్చిన అతుల్ తన పద్దతి
మార్చుకోలేదు. తిరిగి దొంగతనాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే దక్షిణ ఢిల్లీలోని కిషన్ఘర్
ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చోరికి వెళ్లాడు. అయితే అందులో ఐదుగురు పోలీసులు అద్దెకు
ఉంటున్నారనే విషయం అప్పుడు అతనికి తెలియదు. మాములుగా దొంగతనం చేయడానికి వచ్చాడు.
అతడు ఆ ఇంట్లో చోరి చేసే
సమయంలో ఓ బ్యాగ్లో ఢిల్లీలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్
రివాల్వర్ కనిపించింది. దీంతో అతడు రివాల్వర్, పది బులెట్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే తన రివాల్వర్ కనిపించక పోవడం కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని
తెలిపాడు. దీంతో పోలీసు శాఖ రివాల్వర్ను దొంగిలించిన వ్యక్తి కోసం తీవ్రంగా
గాలింపు చేపట్టింది. ఇక, అతుల్ తొలుత ఆ రివాల్వర్ను మంచి ధరకు బయట అమ్మవచ్చని
అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన పాట్నర్స్ విపిన్, విశాల్లతో కలిసి
దోపిడిలకు ప్లాన్ చేశాడు. రివాల్వర్తో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకోవాలని
ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కరోల్ బాగ్ ప్రాంతంలో బంగారం చోరికి
ప్లాన్ వేయడానికి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో రివాల్వర్ దొంగిలించిన వ్యక్తి
గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతుల్ను
అరెస్ట్ చేశారు. ఇక, ఈ కేసుకు సంబంధించి అతుల్ పాట్నర్స్ను కూడా పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరికి గురైన రివాల్వర్, బులెట్లను
స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ పొలిసు ఊపిరి పీల్చుకున్నాడు.