Advertisement

  • 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Thu, 16 July 2020 12:28 PM

15 మంది ఐఏఎస్ అధికారులను  బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు మొత్తం 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేశారు.

ఐఏఎస్ అధికారుల పూర్తి వివరాలు:

వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి - సయ్యద్‌ అలీ ముర్తుజా రజీవీ

రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో) - జ్యోతి బుద్ధప్రకాష్‌

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా - శాంతికుమారి

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ ‌- అదర్‌ సిన్హా

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్ - ఎల్‌ శర్మన్‌

హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ - వాకాటి కరుణ

పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి - కేఎస్‌ శ్రీనివాసరాజు.

పాఠశాల విద్యా డైరెక్టర్ ‌- శ్రీ దేవసేన

సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి - విజయ్‌కుమార్‌

సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ‌- యోగితా రాణా

సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగిస్తారు - రాహుల్‌ బొజ్జా కొనసాగింపు

కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి - రాణి కుముదిని దేవి

ఆదిలాబాద్‌ కలెక్టర్ ‌- సిక్తా పట్నాయక్‌

పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్ - భారతీ హోలీకేరి

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి - ఈ. శ్రీధర్‌

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగించారు.

Tags :

Advertisement