Advertisement

  • తెలంగాణ ఎక్సైజ్ శాఖ మాధవీలత ఆరోపణలపై ఘాటుగా స్పందించారు

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మాధవీలత ఆరోపణలపై ఘాటుగా స్పందించారు

By: chandrasekar Wed, 02 Sept 2020 9:31 PM

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మాధవీలత ఆరోపణలపై ఘాటుగా స్పందించారు


సినీ నటి మాధవిలత టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు మాధవిలత ఆరోపణలపై స్పందించారు. ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలకి తగిన ఆధారాలు ఉండాలన్నారు. పోలీస్ అయినా ఎక్సైజ్ అయినా ఆధారాలతో ముందుకు వెళ్తామన్నారు. డ్రగ్స్ కేసు లో ఇప్పటివరకు చాలామందిని అరెస్ట్ చేశామన్నారు. చాలామందిపై తమ నిఘా కూడా ఉందన్నారు. ఐదు ఏళ్ళ క్రితం పార్టీలకు వెళ్ళితే అప్పుడే ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్ విషయంలో ఎక్సైజ్ పోలీసులు కఠినంగా ఉంటామన్నారు. ఆధారాలు లేకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని ఆమె తెలిపింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందని తెలిపింది. అయితే ఆమె వ్యాఖ్యలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలు ఉంటె తమకు ఇవ్వాలన్నారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేశామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Tags :

Advertisement