తెలంగాణకు రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
By: chandrasekar Tue, 20 Oct 2020 5:46 PM
తమిళనాడు ముఖ్యమంత్రి
హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ. 10 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి
మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా
ఉంటామని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. తక్షణ సాయం కింద రూ. 1,350
కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి
స్పందన రాలేదు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద
సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని
విజ్ఞప్తి చేసారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే సహాయక చర్యలు
చేపడుతామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీల్లోని ప్రజలను కచ్చితంగా
ఆదుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మరణించారు. ఇప్పటి వరకు 29
మందికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందించామని మంత్రి కేటీఆర్
చెప్పారు.