తండ్రి అస్థికలు నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు మృతి ..
By: Sankar Wed, 29 July 2020 9:18 PM
తండ్రి అస్థిక లు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా రావికమతంలో చోటుచేసుకున్నది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
బుచ్చయ్యపేటకు చెందిన సూరిశెట్టి మూర్తి, గోపీలు తండ్రి అస్థికలను జలాశయంలో కలపడం కోసం వెళ్లారు. మూర్తి నీటిలోకి దిగి అస్థికలు కలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సోదరుడుని రక్షించే క్రమంలో గోపి కూడా మరణించాడు.
కొద్దిసేపటి తర్వాత అన్నదమ్ముల మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Tags :
sons |
went |
immerse |
father |
ashes |
water |