Advertisement

ఇక ఆ ప్రాంతంలో వ‌చ్చే ఏడాదే స్కూల్స్ ఓపెన్...

By: chandrasekar Sat, 21 Nov 2020 5:42 PM

ఇక ఆ ప్రాంతంలో వ‌చ్చే ఏడాదే స్కూల్స్ ఓపెన్...


ముంబైలో క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తుండ‌టంతో స్కూల్స్ మ‌రికొంత కాలం మూసే ఉంచాల‌ని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ నిర్ణ‌యం తీసుకుంది.

బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని అన్ని స్కూల్స్ ఈ ఏడాది డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు మూసే ఉంచాల‌ని ఆదేశించింది.

ముందుగా నిర్ణ‌యించిన‌ట్లు న‌వంబర్ 23 నుంచి ముంబై న‌గ‌రంలో పాఠ‌శాల‌లు తెరువ‌డం లేద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే, పుణెలో మాత్రం న‌వంబ‌ర్ 23న పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో పుణె మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కరోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. స్కూళ్ల ప‌రిస‌రాల‌ను, త‌ర‌గ‌తి గ‌దులను శానిటైజ్ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

Tags :
|

Advertisement