ఇక ఆ ప్రాంతంలో వచ్చే ఏడాదే స్కూల్స్ ఓపెన్...
By: chandrasekar Sat, 21 Nov 2020 5:42 PM
ముంబైలో కరోనా కేసులు మళ్లీ
విజృంభిస్తుండటంతో స్కూల్స్ మరికొంత కాలం మూసే ఉంచాలని బృహన్ ముంబై మున్సిపల్
కార్పోరేషన్ నిర్ణయం తీసుకుంది.
బృహన్ ముంబై మున్సిపల్
కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూల్స్ ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు
మూసే ఉంచాలని ఆదేశించింది.
ముందుగా నిర్ణయించినట్లు
నవంబర్ 23 నుంచి
ముంబై నగరంలో పాఠశాలలు తెరువడం లేదని స్పష్టంచేసింది. అయితే, పుణెలో మాత్రం నవంబర్ 23న పాఠశాలలు
పునఃప్రారంభమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పుణె
మున్సిపల్ కార్పోరేషన్ కరోనా మార్గదర్శకాలను జారీచేసింది. స్కూళ్ల పరిసరాలను, తరగతి
గదులను శానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.
Tags :
year |