సెప్టెంబర్ 10వ తేదీన లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్
By: chandrasekar Tue, 01 Sept 2020 6:36 PM
భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10వ తేదీన లాంచ్ అవనుంది. ఈ విషయాన్ని అమెజాన్ మైక్రోసైట్ ద్వారా వెల్లడించింది. గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే జర్మనీలో లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. అలాగే దీనిలో
7000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉండటం విశేషం. సెప్టెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను కూడా అమెజాన్ తెలిపింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర
దీనిలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే జర్మనీలో లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో రానున్న ఈ ఫోన్ ధరను అక్కడ 360 యూరోలుగా (సుమారు రూ.31,500)
నిర్ణయించారు. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మనదేశంలో రూ.25,000-రూ.30,000 మధ్యలో దీని ధర ఉండవచ్చు.
స్పెసిఫికేషన్లు:
ఈ స్మార్ట్ ఫోన్ లో
6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
శాంసంగ్ ఇది ఏ ప్రాసెసరో వెల్లడించలేదు. అయితే ఇది క్వాల్ కాం స్నాప్ డ్రాగన్
730 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. దీని ర్యామ్ సామర్థ్యం 6 జీబీగా ఉంది. స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీగా ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
దీనిలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64
మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 12
మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5
మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5
మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా దీనిలో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను ఉంచారు.
ఆండ్రాయిడ్ 10
ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని శాంసంగ్ అందించింది. 25W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఇందులో కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.