శాంసంగ్ గెలాక్సీ ఏ42 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ 5జీ ఫోన్
By: chandrasekar Mon, 27 July 2020 10:13 PM
చైనా వ్యతిరేకత కారణంగా
దేశంలో ప్రజలు ఇప్పుడు శాంసంగ్ మొబైల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలను
గుర్తించి శాంసంగ్ గెలాక్సీ ఏ42 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్
చైనా 3సీ
వెబ్ సైట్లో కనిపించింది. శాంసంగ్ లాంచ్ చేయనున్న మొదటి బడ్జెట్ 5జీ
ఫోన్ ఇదేనని తెలుస్తోంది. ఈ ఫోన్ వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్
గెలాక్సీ ఏ42 SM-A426B మోడల్ నంబర్ తోనూ, దీని బ్యాటరీ EB-BA426ABY
మోడల్ నంబర్ తోనూ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో
కనిపించాయి. ఈ లిస్టింగ్ ను మొదట 91మొబైల్స్ గుర్తించింది. EB-BA426ABY మోడల్ నంబర్ ఉన్న బ్యాటరీ సామర్థ్యం 4860
ఎంఏహెచ్ గా ఉందనీ, లాంచ్ సమయానికి ఇది 5000 ఎంఏహెచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇది లిథియం-ఇయాన్ బ్యాటరీ అని తెలుస్తోంది. దీని గురించి అంతకంటే ఎక్కువ సమాచారం
అందుబాటులో లేదు.
ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ42
స్మార్ట్ ఫోన్ మొదటగా జూన్ నెలాఖరులో కనిపించింది. SM-A426B మోడల్ నంబర్ తో 128 జీబీ
స్టోరేజ్ తో ఈ ఫోన్ కనిపించిందని శాంమొబైల్ తన కథనంలో పేర్కొంది. ఈ ఫోన్ వచ్చే
సంవత్సరం రానుందని కూడా తన కథనంలో పేర్కొంది. ఇప్పుడు తాజా లిస్టింగ్ లో దీని
బ్యాటరీ సామర్థ్యం లీకైంది. ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ41కు అప్
గ్రేడెడ్ వెర్షన్ గా ఏ42 రానుంది. ఏ41 బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్ గా ఉంది.
ఇప్పుడు ఏ42లో 5000
ఎంఏహెచ్ అందించడానికి 5జీ కనెక్టివిటీనే కారణమని తెలుస్తోంది. శాంసంగ్
ఇప్పటికే కొన్ని ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. త్వరలో 7000
ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ శాంసంగ్
గెలాక్సీ ఏ42 గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారాన్ని
ప్రకటించలేదు. ప్రజలు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు.