ప్రవీణ్కుమార్రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిది: సీఎం జగన్
By: chandrasekar Tue, 10 Nov 2020 4:33 PM
జమ్మూకశ్మీర్లో
ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం
రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్కుమార్ రెడ్డి (37) చనిపోయిన
సంగతి తెలిసిందే. వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల
ఆర్థికసాయం ప్రకటించింది. చీకల ప్రతాప్రెడ్డి, సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి 18 ఏళ్ల
క్రితం మద్రాసు రెజిమెంట్ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు
ఉన్నారు. హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. దేశం కోసం ప్రవీణ్కుమార్రెడ్డి
చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన
త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి
తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం
సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు
ప్రవీణ్కుమార్రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మరోవైపు, ప్రవీణ్
కుమార్ రెడ్డి కుటుంబాన్ని మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తదితరులు
పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సీఎం
జగన్ ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు మంత్రులు తెలిపారు.
తెలంగాణ జవాను మహేష్
కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటాము: మంత్రి
తెలంగాణలోని నిజామాబాద్
జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన ర్యాడా మహేశ్(26) కూడా ఈ
ఎదురుకాల్పుల్లోనే వీరమరణం పొందారు. కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్కు
రోడ్లు, భవనాల
శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్
కమిషనర్ కార్తికేయులు నివాళి అర్పించారు. మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్
రెడ్డి కంటతడి పెట్టారు.
అనంతరం మంత్రి
మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం
కేసీఆర్ ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా
ఇచ్చారు. మంగళవారం సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకోనుంది.