Advertisement

  • నేను బయటపడ్డానికి కారణం దుర్గా మాతా ఆశీర్వాదం...

నేను బయటపడ్డానికి కారణం దుర్గా మాతా ఆశీర్వాదం...

By: chandrasekar Thu, 10 Dec 2020 9:47 PM

నేను బయటపడ్డానికి కారణం దుర్గా మాతా ఆశీర్వాదం...


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

ఘటన అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ... దుర్గా మాతా ఆశీస్సులతోనే నేను ఇవాళ బయట పడ్డానని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఆయన కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. జేపీ నడ్డా వస్తున్నారనే సమాచారం తెలుసుకొని బుధవారం ఉదయం రహదారిని దిగ్బంధించిన కొంత మంది ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అనంతరం వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారు.

Tags :
|

Advertisement