వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుంది
By: chandrasekar Tue, 11 Aug 2020 7:15 PM
రష్యాకు చెందిన కరోనా
వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. దీని వ్యతిరేకంగా
వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆ దేశ పరిశోధకులు తోసిపుచ్చారు. గమలేయా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
అభివృద్ధిచేసిన ఈ వ్యాక్సిన్ పనితీరును ఆ సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్బర్గ్
వెల్లడించారు.
శరీరంలోని మృతకణాలను
ఉపయోగించి కరోనా వైరస్ను అడ్డుకోవటమే ఈ వ్యాక్సిన్ రహస్యమని తెలిపారు. వ్యాక్సిన్
తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుందని, దాంతో
వైరస్ బలహీనపడుతుందని చెప్పారు.
వ్యక్తుల శరీరంలో సహజంగా
ఉండే జ్వరం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బయపడుతుందని, పారసెటమాల్ మాత్ర
వేసుకుంటే తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ను రష్యాలో బుధవారం
అధికారికంగా రిజిస్టర్ చేయనున్నారు. అక్టోబర్లో దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి
వ్యాక్సిన్ వేయనున్నామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖైల్ మురష్కో తెలిపారు.