Advertisement

  • వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుంది

వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుంది

By: chandrasekar Tue, 11 Aug 2020 7:15 PM

వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుంది


రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. దీని వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆ దేశ పరిశోధకులు తోసిపుచ్చారు. గమలేయా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధిచేసిన ఈ వ్యాక్సిన్‌ పనితీరును ఆ సంస్థ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు.

శరీరంలోని మృతకణాలను ఉపయోగించి కరోనా వైరస్‌ను అడ్డుకోవటమే ఈ వ్యాక్సిన్‌ రహస్యమని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుందని, దాంతో వైరస్‌ బలహీనపడుతుందని చెప్పారు.

వ్యక్తుల శరీరంలో సహజంగా ఉండే జ్వరం వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత బయపడుతుందని, పారసెటమాల్‌ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను రష్యాలో బుధవారం అధికారికంగా రిజిస్టర్‌ చేయనున్నారు. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ వేయనున్నామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖైల్‌ మురష్కో తెలిపారు.

Tags :

Advertisement