Advertisement

  • దసరా నేపథ్యంలో మమతకు బంగ్లాదేశ్‌ ప్రధాని అభినందనలు తెలుపుతూ బహుమతులు

దసరా నేపథ్యంలో మమతకు బంగ్లాదేశ్‌ ప్రధాని అభినందనలు తెలుపుతూ బహుమతులు

By: chandrasekar Tue, 20 Oct 2020 5:52 PM

దసరా నేపథ్యంలో మమతకు బంగ్లాదేశ్‌ ప్రధాని అభినందనలు తెలుపుతూ బహుమతులు


బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బహుమతులు పంపారు. దసరా నేపథ్యంలో దుర్గా పూజ సందర్భంగా మమతకు హసీనా అభినందనలు తెలుపుతూ ఈ బహుమతులు పంపినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సోమవారం పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సంబంధిత ప్రోటోకాల్‌ మేరకు ఇవి చేరినట్లు చెప్పారు. బెనపోల్-పెట్రోపోల్ మార్గం ద్వారా కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ అధికారులకు అందిన ఈ బహుమతులను మమతా బెనర్జీకి అందజేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. షేక్‌ హసీనా పంపిన బహుతుల్లో చీర, స్వీట్లు, పుష్పాలున్నట్లు సమాచారం.

కోల్‌కతాలో దసరా సందర్భంగా ప్రతి ఏటా దుర్గా పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సందడి కాస్త తగ్గినప్పటికీ దుర్గా మండపాలను వినూత్నంగా ఏర్పాటు చేశారు. సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఈ దుర్గా మండపాలను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాలు పాటించాలని నిర్వాహకులకు తెలిపారు.

Tags :

Advertisement