చివరి దశకు చేరుకున్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల యుద్ధం
By: chandrasekar Wed, 30 Sept 2020 5:38 PM
అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్, అతని
ఛాలెంజర్ డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఈ రోజు రాత్రి 9
గంటలకు మొదటి అధ్యక్ష చర్చకు హాజరుకానున్నారు. మొత్తం మూడు చర్చలు జరుగనున్నాయి.
మొదటి అధ్యక్ష చర్చ క్లీవ్ల్యాండ్ (ఒహియో) లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్
విశ్వవిద్యాలయం ఆవరణలో 90 నిమిషాలపాటు జరుగనున్నది. దీనిలో 6
సమస్యలపై చర్చ జరుగుతుంది. 24 రోజుల వ్యవధిలో మిగతా రెండు చర్చలు కూడా జరుగుతాయి.
రెండవది (మయామిలోని అడ్రియన్ ఎర్స్ట్ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) 15న, మూడవది
(నాష్విల్లెలోని బెల్మాంట్ విశ్వవిద్యాలయం) అక్టోబర్ 22 న
ఉంటుంది. కరోనావైరస్ కారణంగా మోడరేటర్
ఉంటారు కానీ పానలైట్లు ఉండరు. చేతులు
కలుపుకునే సంప్రదాయం కూడా ఈసారి ఉండదు. మోడరేటర్లు, అభ్యర్థులు మాస్కులు
ధరించరు. వేదిక వద్ద ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా హాజరుకానున్నారు.
10 పాయింట్లు ముందంజలో జో బిడెన్
న్యూస్ వీక్ ప్రకారం నేషనల్ అప్రూవల్ రేటింగ్స్లో అధ్యక్షుడు
ట్రంప్ కంటే 10 పాయింట్లు ముందంజలో జో బిడెన్ ఉన్నారు.
అంటువ్యాధులు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై వారికి ఎక్కువ మద్దతు
లభిస్తుందని నమ్ముతున్నారు. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ నుండి వచ్చిన పోల్స్ ప్రకారం బిడెన్ 54-44తో ముందంజలో ఉన్నాడు. అయితే, ట్రంప్
త్వరలో కరోనాను అధిగమిస్తారని, అప్పుడు రేటింగ్స్ పెరుగుతుందని నమ్మే కొందరు ఓటర్లు
కూడా ఉన్నారు.